ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటెండెంట్ పోస్టుల భర్తీకి ఆర్బీఐ ప్రకటన జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 12:38 PM

పదో తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా అటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. మొత్తం 572 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదో తరగతిని అర్హతగా నిర్ణయించింది. పదో తరగతి పాసైన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా, దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే.పదో తరగతి కనీస అర్హత కలిగిన ఉద్యోగాలకూ పీజీ, పీహెచ్ డీ చేసిన అభ్యర్థులు పోటీపడుతుంటారు. దీంతో పదోతరగతితో చదువు ఆపేసిన వారికి ఆ ఉద్యోగం దొరికే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ లో కీలకమైన షరతు విధించింది. అటెండెంట్ ఉద్యోగానికి పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు సరిపోతారని వివరిస్తూ.. ఉన్నత విద్యావంతులను ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటించింది. ఉన్నత విద్యార్హతలు ఈ పోస్టులకు అనర్హతగా పరిగణిస్తామని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa