రాష్ట్రంలో జగన్ రాక్షస ప్రభుత్వం సాగుతుందని విమర్శించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు . సీఎం జగన్ తన చేతగాని పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పేదలను దోచుకుంటూ పబ్బంగడుపుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైన మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని దీమా వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన సాగుతుందని దుయ్యబట్టారు. పన్నులతో పేదలను పీక్కుతింటున్నారని మండిపడ్డారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ తండ్రి, తాతా, ముత్తాతలు కూడా టీడీపీని ఏం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా వైసీపీ నేతలకు చెల్లిస్తామని హెచ్చరించారు. ఓటిఎస్ పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్కు జనం గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని విమర్శించారు. ఏపీ అంటే అస్యహించుకునే పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని విమర్శించారు. ఏపీ ఆస్తులను తెలంగాణకు దోచిపెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa