ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆధ్యాతిక గురువుు కాళీచరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్ను చత్తీస్గఢ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఆయనను రాయ్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చత్తీస్గఢ్కు తరలించారు. గత ఆదివారం రాయ్పుర్లోని రావణ్ భాగా మైదానంలో జరిగిన ధర్మ సన్సద్లో కాళీచరణ్ మహారాజ్ ప్రసంగిస్తూ మహాత్ముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాంధీని దూషిస్తూ గాడ్సేను ప్రశంసించడం వివాదానికి దారితీసింది. అంతేగాక, హిందూ మతాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రభుత్వాధినేతగా బలమైన హిందూ నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలను పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీని రాయ్పూర్ పోలీసులకు కాంగ్రెస్ నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. ఘటన తర్వాత కాళీచరణ్ మహారాజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల ట్రాక్ చేస్తారన్న అనుమానంతో ఆయన అనుచరులు కూడా ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘తన ఆచూకీ తెలియకుండా మధ్యప్రదేశ్లోని ఖజురహోకు సమీపంలో బాగేశ్వర్ ధామ్లో ఆయన గెస్ట్హౌజ్ బుక్ చేసుకున్నట్లు సమాచారం అందింది.. అక్కడకు గురువారం ఉదయం వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు’ అని ఛత్రపూర్ ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa