టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వార్షిక జీతాలకు భారీగా కోత పడనుంది. బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్టులను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం అత్యున్నత ఏ+ గ్రేడ్లో ఉన్న వీరిద్దరినీ బీ కేటగిరీకి మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ ఒక్కో ఫార్మాట్కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో అసలు ఏ+ కేటగిరీనే పూర్తిగా రద్దు చేయాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పోర్ట్స్ స్టార్ తో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు."ఈ ప్లాన్ను త్వరలోనే అమలు చేస్తాం. ఏ+ కేటగిరీకి అర్హులైన ఆటగాళ్లు ఇప్పుడు కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నారు. ఏ+ కోసం మేము నిర్దేశించిన ప్రమాణాలను వారు అందుకోవడం లేదు. అందుకే ఆ కేటగిరీని తొలగిస్తున్నాం. ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయమే. ఆటగాళ్లతో మాకు ఎలాంటి విభేదాలు లేవు" అని సైకియా స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa