ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బియ్యం అని చెక్ చేస్తే... గుట్కా బయటపడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 03:33 AM

బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అనుమానంతో లారీని చెక్ చేయగా పోలీసులు షాక్ కు గురి కావలసి వచ్చింది. పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా ను లారీలో సరఫరా చేస్తున్నారు. వీటిని గుర్తించిన విశాఖ పోలీసులు లారీ నడిపే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. సుమారు కోటి రూపాయల విలువైన చైనా ఖైనీ, టుబాకో గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం తమకు అందిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఓ లారీ బియ్య బస్తాలతో పాటు 5.5 టన్నుల గుట్కా బస్తాలు పార్సిల్ గుర్తించామన్నారు. అందులో నిషేధిత రాజా ఖైనీ టుబాకో ప్యాకెట్లు, 22 బస్తాలు చైనా టుబాకో ఉన్నాయని తెలిపారు. ఈ అక్రమ రవాణాలో లారీ డ్రైవర్ సహా ఇద్దరిని అరెస్టు చేశామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ నుంచి సబ్బవరం రప్పించి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి చెందిన రిటైల్ వ్యాపారులకు విక్రయించేందుకు సరుకు తెచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


,,,,






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa