ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) తో వృద్ధాప్యంలో ప్రయోజనం

national |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 10:59 AM

వృద్ధాప్య వయసులో జీవనాధారం కోసం అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) ఈ పథకం ఎంతో కలిసి వస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్కీమ్ కింద భార్యాభర్త ప్రతి నెలా రూ.10000ను పెన్షన్‌గా పొందవచ్చు. ఈ ప్లాన్ కింద ఎన్నో ప్రయోజనాలను ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది.  అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌ను ప్రభుత్వం 2015లో లాంచ్ చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అప్పట్లో ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు భారత పౌరసత్వం కలిగిన ఎవరైనా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందవచ్చు. బ్యాంకు లేదా పోస్టు ఆఫీసులో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు, ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన డిపాజిటర్లకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్ కింద, నెలవారీ కనీసం రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000ను పెన్షన్‌గా పొందవచ్చు. గరిష్టంగా రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఇది సురక్షితమైన పెట్టుబడి సాధనం. ఈ స్కీమ్‌లో రిజిస్టర్ కావాలంటే, మీకు సేవింగ్స్ అకౌంట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అవసరం. అయితే ఈ స్కీమ్ కింద కేవలం ఒకే పెన్షన్ అకౌంట్‌ను ఇస్తారు. ఎంత త్వరగా దీనిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అంత ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. 18 ఏళ్ల సమయంలోనే మీరు కనుక అటల్ పెన్షన్ యోజనలో చేరితే, 60 ఏళ్లు వచ్చేసరికి మీకు మంచి పెన్షన్ లభిస్తుంది. 18 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5 వేల పెన్షన్ కోసం రూ.210 పెట్టుబడిగా పెడితే చాలు.3 9 ఏళ్ల కంటే తక్కువ వయసున్న జీవిత భాగస్వాములకు కూడా ఈ స్కీమ్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన తర్వాత జాయింట్ పెన్షన్‌గా రూ.10 వేలు లభిస్తాయి. ఒకవేళ భార్యా, భర్త వయసు ఇద్దరిదీ 30 కంటే తక్కువ వయసుంటే, నెలకు వారి ఏపీవై అకౌంట్లలో రూ.577 ఇన్వెస్ట్ చేయాలి. 35 ఏళ్లు ఉన్న భార్యాభర్తలైతే నెలకు రూ.902ను డిపాజిట్ చేయాలి. నెలవారీ పెన్షన్ గ్యారెంటీతో పాటు, ఒకవేళ జీవిత భాగస్వామి మరణిస్తే, భార్యకి లేదా భర్తకి రూ. 8.5 లక్షలు లభిస్తాయి. అతేకాక ప్రతి నెలా మొత్తం పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజనకి ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద రూ.లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలున్నాయి. దీని నుంచి పన్ను ఆదాయం డిడక్ట్ చేస్తారు. అంతేకాక కొన్ని కేసులలో రూ.50 వేల వరకు అదనపు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మొత్తంగా ఈ స్కీమ్ కింద రూ. 2 లక్షల వరకు డిడక్షన్ పొందవచ్చు. 4.2 కోట్ల మంది ఎన్‌పీఎస్ సబ్‌స్క్రయిబర్లలో 2.8 కోట్ల మందికి పైగా ప్రజలు ఏపీవైను ఎంపిక చేసుకున్నారు. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రయిబర్లలో 3.77 కోట్ల మంది నాన్ మెట్రోపాలిటన్ నగరాలకు చెందిన వారే..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa