కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడు అన్ని రంగాలపై పడింది. క్రీడారంగంపై కూడా తన కన్ను వేసినట్టుంది. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీలో కరోనా ఎంట్రీ ఇచ్చింది. బెంగాల్ రంజీ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం బీసీసీఐ పునారాలోచనలో పడింది. టోర్నీ నిర్వహిస్తే పరిస్థితి ఏంటన్న మీమాంసలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గతేడాది జరగాల్సిన రంజీ ట్రోఫీ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు పెరిగిన కేసులతో మరోసారి రంజీ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయ్. దేశీయ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని నిర్వహించవచ్చు. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, రంజీ ట్రోఫీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ భద్రతా చర్యలు తీసుకుంది. బెంగాల్ క్రికెటర్లందరికీ RT-PCR పరీక్షలను నిర్వహించిందని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కార్యదర్శి స్నేహాశిష్ గంగూలీ తెలిపారు. ఇందులో ఏడుగురు ఆటగాళ్లకు పాజిటివ్గా తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa