ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమించిన యువకుడు మరణించడంతో ప్రేమికురాలు కూడా ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 03:34 PM

ప్రేమించిన యువకుడు ప్రమాదవశాత్తు మరణించడంతో ప్రేమికురాలు కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో శృతి అనే యువతి పీయూసీ సెకండియర్ చదువుతుంది. ఆమెకు బసవన బగేవది ప్రాంతానికి చెందిన బంధువుల అబ్బాయి హనుమంత్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెద్దలు కూడా వారి పెళ్లికి అంగీకరించారు. హనుమంత్ వ్యవసాయం చేస్తుంటాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి హన్మంత్ నెలక్రితం మరణించాడు. దీంతో అప్పటి నుంచి శృతి అతని జ్ఞాపకాలతోనే బతుకుతుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చచెప్పినా వినలేదు. వేరే పెళ్లి చేస్తేనైనా మారుతుందనుకున్నారు. ఆమెకు సంబంధాలు చూస్తున్నారు. తన ప్రేమికుని స్థానంలో మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయిన శృతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమకు పెద్దలు అంగీకరించినా విధి వక్రీకరణతో వీరి జీవితం అర్దాంతరంగా ముగిసిందని అంతా కన్నీరు మున్నీరవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa