వందే భారత్ స్లీపర్ రైళ్ల రాకతో భారతీయ రైల్వే వ్యవస్థలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందిస్తున్న తరుణంలో, రైల్వే శాఖ టికెట్ రిజర్వేషన్ మరియు రద్దు (Cancellation) విధానంలో కొత్త, కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది.వందే భారత్ స్లీపర్ రైళ్లలో టికెట్ రద్దు చేయాలనుకునే ప్రయాణికులకు కొత్త నిబంధనలు పెద్ద షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక టికెట్ను 72 గంటలకు ముందే రద్దు చేస్తే మొత్తం టికెట్ ధరలో 25% రద్దు ఛార్జీగా deduct అవుతుంది.అయితే, టికెట్ను 72 గంటల నుండి 8 గంటల మధ్య రద్దు చేస్తే, రైల్వే శాఖ మొత్తం టికెట్ విలువలో 50% మొత్తాన్ని రద్దు ఛార్జీగా తీస్తుంది.ముఖ్యంగా, ప్రయాణ సమయానికి 8 గంటల లోపు రద్దు చేస్తే ఏ రిఫండ్ కూడా లభించదు. అంటే ఆ టికెట్కు మీరు ఒక్క రూపాయి కూడా తిరిగి పొందలేరు.ఈ కొత్త చర్య చివరి నిమిషం లో టికెట్లను రద్దు చేసే ప్రయాణికులను నిరుత్సాహపరచడానికి తీసుకోవడమని అధికార వర్గాలు చెబుతున్నాయి — తద్వారా సీట్లు వృథా కాకుండా ఉండాలని లక్ష్యంగా పెట్టినట్టు తెలిపింది.రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది: Vande Bharat Sleeper రైళ్లలో RAC (Reservation Against Cancellation) లేదా Waiting List విధానం ఉండదు. అంటే, కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్లు ఉన్నవారు మాత్రమే ప్రయాణం చేయగలరు; RAC లేదా వెయిటింగ్ టికెట్లను ఇవ్వడం లేకుండా పూర్తిగానే తీసివేశారు.ఈ మార్పుల వల్ల ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను పూర్తిగా ఖచ్చితంగా నిర్ణయించి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే రద్దు సమయంలో భారీ నష్టాలు ఎదురవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa