ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 10:47 AM

విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్వతీపురం పట్టణం పైడి భీమవరంలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదం స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. విషవాయువు లీకై ఒకరి మృతితో పాటు మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. తమవారికి ఏమైందోనని ఆత్రుతతో పరిశ్రమ, ఆసుపత్రి వద్దకు పరుగులు శుక్రవారం సాయంత్రం 5.40 సమయంలో ఘటన జరిగినా విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


స్థానిక సరాకాపరిశ్రమలో పెంటా ప్రోజుల్ సోడియం బ్లాక్ లో క్లోరిన్ విషవాయువు వెలువడింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న బోగి ప్రసాద రావు (45)తో పాటు మరో నిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసాదరావు మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మహేంద్ర, జేఆర్ పురం సీఐ స్వామినాయుడు, ఎస్సై రాజేష్ పరిశీలించారు.


ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎ తెలిపారు. బాధితులు వివరాలిలా ఉన్నాయి. ఈ ఘటనలో కార్మికులు ఐ. నాగరాజు, ఆర్. శ్రీనివాసరావు, సంతోష్ కుమార్, మనోజ్, పి. రమణ, మిలా నాసాబర్, ఆజయ్ బర్, రోత్వార్


మళ్ళీ ఆస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని పూసపాటిరేగ మండలం, ఒడిశా రాష్ట్రానికి చెందినవారు వీరంతా. చికిత్స పొందుతున్న కార్మికులు ప్రస్తుతం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. వీరంతా విజయనగరంలోనే నివాసముంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa