ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విధుల్లో చేరకపోతే నష్టపోతారు: అజయ్ జైన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 11, 2022, 02:01 PM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సూచించారు. ప్రభుత్వం అందరికీ ప్రొబేషన్, కన్ ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించదు. రోడ్లపైకి వస్తే పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలోస్తాయని అనుకుంటున్నారేమో.. ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే తర్వాత నష్టపోతారని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నేతలతో అన్నారు. వెంటనే విధుల్లో చేరి ప్రభుత్వానికి మీపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాగా విధుల్లో చేరి నిరసనలు కొనసాగిస్తామని సంఘాల నేతలు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa