ట్రెండింగ్
Epaper    English    தமிழ்

227వ సార్లు నామినేషన్లు వేసి ఎలక్షన్ కింగ్‌గా పేరుగాంచిన వ్యక్తి కధ

national |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 06:55 PM

ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేస్తున్నాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. ఇప్పటి వరకు 200కు పైగా ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసి, అత్యంత విఫలమైన అభ్యర్థిగా రికార్డును తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. ఎలక్షన్ కింగ్‌గా పేరుగాంచాడు. ఫిబ్రవరి 19న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
 ఆయన నామినేషన్ దాఖలు చేయడం ఇది 227వ సారి. ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా, నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తొలి అభ్యర్థుల్లో పద్మరాజన్ ఒకరు. అత్యధిక సార్లు పోటీ చేయడంతో పాటు, అత్యధికంగా విఫలమైన అభ్యర్థిగా రికార్డు సృష్టించాడు. వృత్తిరీత్యా టైర్ల వ్యాపారి అయిన 62 ఏళ్ల పద్మరాజన్.. 1986లో మెట్టూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి (లక్నో), మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు (నంద్యాలలో),ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, KR నారాయణన్, APJ అబ్దుల్ కలాంలపైన సైతం పోటీ చేశారు. తాజాగా మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తమిళనాడులోని వెరకల్‌పుదూర్ (వార్డు 2) నుంచి ఫిబ్రవరి 19న జరిగే సివిక్ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 19న రాష్ట్రంలోని 21 మునిసిపల్ కార్పొరేషన్లు, 138 మునిసిపాలిటీలు,490 నగర పంచాయతీలలోని వివిధ పదవులకు ఒకే దశలో ఎన్నికలను నిర్వహించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa