ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాదాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 04:52 PM

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి సంక్షేమ అభివృద్ది పధకాలను అందించాలనే కృత నిశ్చయంతో ఉందని, భూ సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో స్పందించి సమస్యలు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశపు మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) రాజాబాబుతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాదాన్యత ఇచ్చి పరిష్కరించాలని అర్హులు కాని వారి విషయంలో వారితో చర్చించి అనర్హతకు గల కారణాలను వారికి తెలియజేయాలని సూచించారు. గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పధకాల పై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని మండలాలలో 22 ఏ కి సంబందించి పరిష్కరించాల్సిన భూ సమస్యలకు సంబందించిన రిపోర్టును వెంటనే పంపాలని, పట్టా దారు పాసు పుస్తకాలకు సంబందించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.

జిల్లాలోని 1564 గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై. ఎస్. ఆర్ జగనన్న భూ సర్వే, భూ రక్ష పధకంను వేగ వంతం చేయాలన్నారు. గృహ నిర్మాణాలకు సంబందించి పెండింగ్ లో ఉన్న మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, నవరత్నాలలో భాగంగా 90 రోజులలో ఇంటి పట్టాల పంపిణీ లో భాగంగా అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని అన్నారు. భూ సమస్యల పై కోర్టు కేసుల విషయంలో పిటిషన్ లు వేయాల్సి ఉంటే సకాలంలో స్పందించాలని, జాతీయ రహదారులకు సంబందించి భూ సేకరణ మరియు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎస్. సి. , ఎస్. టి మానిటరింగ్ కమిటీ సమావేశాలను మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చూడాలని, కేసులకు సంబందించిన రిపోర్టులను సకాలంలో పంపాలని అన్నారు. కుల దృవీకరణ పత్రాలు ఆలస్యం లేకుండా అందజేయాలన్నారు. లోక్ యుక్తలో ధాఖలు అయిన పలు కేసులకు సంబందించి పిటిషన్ లను సకాలంలో వేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (ఆసరా) రాజశేఖర్, డి. ఆర్. ఓ ఎం. ఎస్. మురళి, చిత్తూరు ఆర్. డి. ఓ రేణుక, తిరుపతి ఆర్. డి. ఓ కనకనరసా రెడ్డి, తాహాసీల్ధార్లు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa