దేశంలో ఓ అత్యున్నత పదవి తెలుగు మేధావిని వరించింది. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) చైర్మన్గా జేఎన్యూ వైస్ ఛాన్సలర్ ఎం. జగదీష్ కుమార్ నియమితులయ్యారు. గతేడాది నుంచీ ఈ పదవి ఖాళీగా ఉంది. ఇంతకు ముందు యూజీసీ ఛైర్మన్గా విధులు నిర్వర్తించిన ప్రొఫెసర్ డీపీ సింగ్కు 65 ఏళ్లు నిండడంతో గతేడాది డిసెంబర్ 7న ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో తాజాగా జగదీష్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
న్యూఢిల్లీలో ప్రఖ్యాత జేఎన్యూ విశ్వవిద్యాలయానికి వీసీగా జగదీష్ కుమార్ 2016 నుంచి ఉన్నారు. జనవరి 26తో ఆయన పదవీకాలం పూర్తయినా, తదుపరి వీసీ వచ్చే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. అయితే ఆయనను యూజీసీ వీసీగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జగదీష్ కుమార్ తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. ఆయనకు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగంలో అపార అనుభవం ఉంది. ఐఐటీ మద్రాస్లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి ఆయన ఎంఎస్, పీహెచ్డీ పొందారు. 1994 - 1995 కాలంలో ఐఐటీ ఖరగ్పూర్లోని ఈసీఈ విభాగంలో విజిటింగ్ ఫ్యాకల్టీగా, అసెస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1997లో ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. తదనంతర కాలంలో ప్రఖ్యాత జేఎన్యూ వీసీగా నియమితులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa