ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రకటనతో రాజకీయంగా వేడి రాజుకుంది. జిల్లా కేంద్రాల విషయంలోనూ, కొన్ని ప్రాంతాలను దూరప్రాంతంలోని జిల్లాలలో కలపడంలోనూ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికార పార్టీలోనే కుమ్ములాటలు మొదలయ్యాయి. తమ తమ ప్రాంతాలను జిల్లా కేంద్రం చేయాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోటాపోటీగా ప్రకటనలు గుప్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై తన అభిప్రాయాన్ని తెలుపుతూనే, హిందూపురంలో బాలకృష్ణ నిరసన తెలిపారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే స్థానికుల డిమాండ్కు మద్దతు పలికారు. శనివారం స్థానికంగా మౌన దీక్ష చేపట్టి ప్రజల ఆకాంక్షను గుర్తించాలని ప్రభుత్వానికి సూచించారు. పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై తనకు వ్యతిరేకత లేదని, అయితే ప్రజాభీష్టం మేరకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. నిరసన అనంతరం అఖిలపక్ష నేతలతో కలిసి దీనిపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాడుతామన్నారు. ప్రాంతీయ విద్వేషాలను ప్రభుత్వం రెచ్చగొట్టిందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా పేరుపై స్పందిస్తూ, అందులో రాజకీయం ఉందన్నారు. ఎన్టీఆర్పై అంత ప్రేమ ఉంటే అన్నా క్యాంటీన్లను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసేంత వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైతే సీఎం జగన్ను కలిసేందుకూ సిద్ధమంటూ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa