స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, సోషల్ మీడియా విస్తరణతో యువతులు సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువవుతోందని V. C. Sajjanar హెచ్చరించారు.నకిలీ ఆన్లైన్ గుర్తింపులతో పరిచయాలు పెంచుకుని, యువతులను మోసం చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.Facebook, Instagram వంటి వేదికల్లో ఆకర్షణీయమైన ఫోటోలు, సినీ నటుల చిత్రాలతో నకిలీ ఖాతాలు సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారని వెల్లడించారు. పరిచయం ఏర్పడిన తర్వాత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపించేలా ప్రలోభపెట్టి, వాటిని ఆధారంగా తీసుకుని బాధితులను బెదిరిస్తున్నారని చెప్పారు.ఒకసారి వ్యక్తిగత సమాచారం చేతికి చిక్కిన వెంటనే డబ్బులు డిమాండ్ చేయడం, ఫోటోలను మార్పులు చేసి మరింత ఒత్తిడి తేవడం వంటి చర్యలకు దిగుతున్నారని తెలిపారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు కుటుంబ సభ్యులకు చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కారణంగా పలువురు మహిళలు మానసికంగా తీవ్రంగా నలిగిపోతున్నారని, కొన్ని విషాదకర ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితులు ఎదురైతే భయపడకుండా వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, లేకపోతే పోలీసులను సంప్రదించాలని V. C. Sajjanar సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని తెలిపారు. బాధితులకు పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.పిల్లలతో సమయం గడుపుతూ వారి ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచించారు. నకిలీ ప్రొఫైల్లు, నంబర్లు, VPNలు ఉపయోగించినా నిందితులు తప్పించుకోలేరని హెచ్చరించారు. “ఎక్కడ ఉన్నా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు రావాలని మహిళలకు హైదరాబాద్ నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa