Uttar Pradeshలో ఘోర మోసం వెలుగులోకి వచ్చింది. తాను ఐఏఎస్ అధికారినని నమ్మించి ఓ యువతిని వివాహం చేసుకున్న వ్యక్తి, మరుసటి రోజే ఆమెను అమ్మేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటన Gorakhpurలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, ఇటావాకు చెందిన ప్రీతమ్ కుమార్ నిషాద్ అనే వ్యక్తి తాను ఐఏఎస్ అధికారి అంటూ తప్పుడు ప్రచారం చేసుకుని పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు.తన మాటలను నమ్మించేలా కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులతో తీసుకున్న ఫోటోలు, వీడియోలను వధువు కుటుంబానికి పంపించాడు. దీంతో అతను నిజంగానే ఐఏఎస్ అని వారు నమ్మిపోయారు. పైగా వరకట్నం అవసరం లేదని చెప్పడంతో వధువు కుటుంబం తొందరపడి పెళ్లికి అంగీకరించింది. అయితే అతని అసలు స్థాయి గురించి సరైన సమాచారం సేకరించలేదు.కానీ పెళ్లి సమయానికి పరిస్థితి మారింది. కట్నం అవసరం లేదన్నప్పటికీ, పెళ్లి ఖర్చుల పేరుతో రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో వధువు కుటుంబం ముందుగా రూ.10 లక్షలు, పెళ్లి రోజు మరో రూ.5 లక్షలు ఇచ్చింది. వివాహ ఖర్చులతో కలిపి మొత్తం రూ.30 లక్షలు వెచ్చించి ఈ నెల 11న పెళ్లి జరిగింది.పెళ్లి తర్వాత అత్తవారింటికి వెళ్తున్న సమయంలోనే యువతిపై అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటికి చేరుకున్న తరువాత ఆమెను ఒక గదిలో బంధించారు. అయితే బాధితురాలు ఎలాగోలా ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది.వెంటనే ఆమె తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. వారిని చూసిన వరుడు మరియు అతని సోదరి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమయంలో మరింత షాకింగ్ విషయం బయటపడింది—వధువును అమ్మేందుకు వారు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ప్రీతమ్ మరియు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ Kaustubh తెలిపారు. మానవ అక్రమ రవాణా కోణంలో కూడా ఈ కేసును పోలీసులు గంభీరంగా తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa