ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యులకు షాకింగ్ న్యూస్.. పెరిగిన వాటర్ బాటిళ్ల ధరలు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 21, 2026, 01:45 PM

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావంతో ముడి చమురు ధరలు పెరగడంతో ప్లాస్టిక్ తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో బిస్లరీతో సహా పలు కంపెనీలు ధరలను 8 నుంచి 11 శాతం వరకు పెంచాయి. పాలిమర్, మూతలు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు పెరగడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఉదాహరణకు 1 లీటర్ ఉన్న 12 బాటిళ్ల ప్యాక్ ధర రూ.216 నుంచి రూ.240కు చేరింది. యుద్ధ పరిస్థితులు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa