కట్టుకున్న భార్యే భర్తను దారుణంగా హత్య చేశాడు. పదునైన ఆయుధంతో దాడిచేసి చంపేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటిని గోనె సంచిలో పెట్టి నది ఒడ్డున పాతిపెట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ భయానక ఘటన బీహార్లో చోటు చేసుకుంది. ఇంతకి ఆమె ఏం తప్పు చేసిందో తెలుసా..? కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నిలదీసినందుకు ఆమెను హతమార్చాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని నరికి చంపాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంకా జిల్లా ధోరయా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాహిర్పూర్ గ్రామానికి చెందిన హేమంత్ యాదవ్, రీమా దేవి భార్యా భర్త. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ కొంతకాలంగా హేమంత్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. కోడలి వరసయ్యే ఓ మహిళతో అతడు వివాహేతర సంబంధంపెట్టుకున్నాడు. వీరి వ్యవహారం రీమా దృష్టికి వచ్చింది. ఇలా చేయడం తప్పని భర్తకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అతడు ఎంత చెప్పినా వినలేదు. ఈ విషయమై ఇరువరి మధ్య నిత్యం గొడవలు జరుగేవి. స్థానిక ప్రజాప్రతినిధులు పంచాయితీ నిర్వహించి ఇద్దరికీ సర్ది చెప్పారు. ఐనా హేమంత్ బుద్ధి మారలేదు. అలాగే వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఇటీవల మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భార్య రీమా దేవి అడ్డు తొలగించుకోవాలని హేమంత్ ప్లాన్ చేశాడు.
తాను అనుకున్నట్లుగానే భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. సాక్షాధారాలను చెరిపి వేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు హేమంత్. ఇంట్లో భార్యను చంపిన తర్వాత.. మృతదేహాన్నిముక్కలు ముక్కలుగా నరికాడు. వాటిని ఓ గోనెసంచిలో ఉంచి నదీ ఒడ్డున పాతిపెట్టాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. రీమా దేవి కనిపించకపోవడం తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఆ కేసుపై దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీస్ కుక్కలు ఓ నది ఒడ్డునకు వెళ్లి ఆగాయి. అక్కడ తవ్వి చూడగా ఓ సంచి బయటపడింది. అందులో మానన శరీర అవయవాలు కనిపించాయి. అది రీమా దేవి మృతదేహమని నిర్ధారించుకున్న పోలీసులు భర్తపై కోసం గాలిస్తున్నారు. ధోరయా పోలీస్ స్టేషన్ చీఫ్ మహేశ్వర్ రాయ్ మాట్లాడుతూ... హత్య అనంతరం హేమంత్, అతడి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల వాంగ్మూలం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని, కఠిన శిక్ష పడేలా ఆధారాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలన రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa