ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)’ తన ఖాతాదారులకు ఓ శుభవార్త అందించింది. పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వ నిర్వహణ అంశాన్ని సమీక్షించింది. కనీస నగదు నిల్వలతో పాటు, ఆయా ఖాతాలపై విధించే సర్వీస్ ఛార్జ్లను సవరించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీస నగదు నిల్వను రూ. 5000 నుంచి రూ. 3000 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా 5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
నగదు నిర్వహించని ఖాతాలకు విధించే రుసుములను కూడా 20 నంచి 50 శాతం మేర సవరించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జీలను ఆయా ఖాతాలను బట్టి రూ. 20 నుంచి రూ. 40 వరకు, మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ. 30 నుంచి రూ. 50 వరకు విధించింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి.
జన్ధన్ ఖాతాలకు కనీస నగదు నిల్వల పరిమితి లేని విషయం తెలిసిందే. తాజాగా దీన్ని పెన్షనర్లు, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే ఖాతాదారులు, మైనర్ల ఖాతాలకు కూడా వర్తింపజేశారు. ఎస్బీఐలో మొత్తం 42 కోట్ల ఖాతాలుండగా అందులో 13 కోట్లు పీఎంజేడీవై, సాధారణ పొదుపు ఖాతాలే ఉన్నాయి. వీటిని ఇంతకు ముందే ఛార్జీల నుంచి మినహాయించారు.
సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు సంబంధించి కనీస నగదు నిల్వలో ఎలాంటి మార్పులు లేవు. వీరు ఇంతకుముందు మాదిరిగానే వరసగా రూ. 2000, రూ. 1000లను కనీస నగదు నిల్వలుగా కొనసాగించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa