'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నుంచి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' వైపు అడుగులు వేస్తున్నామని, పెట్టుబడులను వారాల వ్యవధిలోనే కార్యరూపంలోకి తెచ్చేలా 2035 నాటికి రాష్ట్రాన్ని 'డే-జీరో రెడీ స్టేట్'గా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. నమ్మకం, వేగం అనే రెండు అంశాలు ఏపీని కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.దావోస్లో జరిగిన 'ద ఫాస్ట్ లేన్: ఇన్వెస్టింగ్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ గ్రోత్' అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి సమయం ఆదా చేయడమే అతిపెద్ద లాభం. ఇదే రాష్ట్రానికి ఆర్థిక పోటీలో ఆధిక్యతను ఇస్తోంది. దీనికోసం రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి ప్రతినెలా సమావేశమై ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడంతో పాటు, అంతర్గత సమస్యలను పరిష్కరిస్తోంది. భూమి, యుటిలిటీస్, పర్యావరణ అనుమతుల వంటి అంశాల్లో వరుస అనుమతులకు బదులుగా ప్యారలల్ ప్రాసెసింగ్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రాజెక్టులు ప్రారంభించే సమయాన్ని గణనీయంగా తగ్గించాం" అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa