ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గేట్ వేయకపోవడంతో ఘోర ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 08:34 AM

ఝార్ఖండ్‌లో ఓ రైల్వే గేట్ వద్ద ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది. గేట్ వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ జిల్లాలోని నవాదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ భారీ ట్రక్కు.. రైలు పట్టాలపై నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్ గుండా గోండా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ముందు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రక్కు ముందుకు వెళ్లలేక ట్రాక్ పైనే నిలిచిపోయింది. దీంతో ఆ రైలు, ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. లోకో పైలెట్ త్వరగా స్పందించి రైలు వేగాన్ని తగ్గించారు. దీంతో ట్రక్కును ఢీకొట్టిన రైలు అక్కడే ఆగిపోయింది.ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా దెబ్బతింది. రైలు ఇంజిన్ పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు. ఈ ప్రమాదం కారణంగా జసిడిహ్-అసన్‌సోల్ మార్గంలో రైలు రాకపోకలు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. ఈ ఘటనపై నలుగురు సభ్యుల కమిటీ విచారణ చేయబోతున్నట్టు అసన్‌సోల్ రైల్వే డివిజన్ అధికారి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa