టీ20 ప్రపంచకప్-2022 ఆస్ట్రేలియాలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ టికెట్లను అమ్మకానికి ఉంచినట్లు ఐసీసీ తెలిపింది. ఈ టికెట్ ధరలను పిల్లలకు 5 డాలర్లు(రూ.374), పెద్దలకు 20 డాలర్లుగా (దాదాపు రూ.1495) నిర్ణయించినట్లు పేర్కొంది. t20worldcup.com వైబ్సైట్లో సోమవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
వరల్డ్ కప్ టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. 7 మైదానాల్లో మొత్తంగా 45 మ్యాచ్లు జరగనున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ మైదానాల్లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్, నవంబర్ 13న మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరగనుంది. సెమీఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్, ఓవల్ వేదికగా నవంబర్ 9, 10న నిర్వహించనున్నారు. టీ20 ప్రపంచకప్ నకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa