ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక బ్యారెల్ ధర 100 డాలర్ల కాంతిని దాటడంతో, ఈ మార్పు దేశీయ ఇంధన ధరలపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను స్థిరంగా ఉంచినా, ప్రైవేట్ రంగంలో ఉన్న చమురు కంపెనీలు సామాన్యులను షాక్ చేస్తూ ధరలను గణనీయంగా పెంచాయి.ప్రైవేట్ కంపెనీల భారీ పెంపులో నయారా ఎనర్జీ (Nayara Energy) తరువాత, షెల్ ఇండియా (Shell India) కూడా ఏప్రిల్ 1 నుండి ఇంధన ధరలను పెంచింది. గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ధరల వల్ల ఏర్పడే నష్టాలను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షెల్ ఇండియా లీటరుకు పెట్రోల్ ధరను రూ. 7.41, డీజిల్ ధరను రూ. 25 పెంచింది. ఈ పెంపుతో ప్రైవేట్ అవుట్లెట్లలో పెట్రోల్ ధర సుమారు రూ. 119, డీజిల్ ధర రూ. 123 వద్దకు చేరింది.ప్రైవేట్ కంపెనీలు ధరలను పెంచినప్పటికీ, ఇండియన్ ఆయిల్ (IOC), హెచ్పీసీఎల్ (HPCL), బీపీసీఎల్ (BPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికీ పాత రేట్లలో ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ అవుట్లెట్లలో పెట్రోల్ రూ. 94–106, డీజిల్ రూ. 78–97 మధ్య ఉంది.సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ప్రీమియం వేరియంట్ల ధరలు కూడా పెరిగాయి. ఇండియన్ ఆయిల్ తన ప్రీమియం పెట్రోల్ ‘XP100’ ధరను లీటరుకు రూ. 11 పెంచింది. గతంలో రూ. 149 ఉన్న ధర ఇప్పుడు రూ. 160కు చేరింది. అలాగే, ఎక్స్ట్రా గ్రీన్ డీజిల్ ధర రూ. 91.49 నుంచి రూ. 92.99కి పెరిగింది.ధరల పెంపుకు ప్రధాన కారణం రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరఫరాలో అంతరాయాలు, మరియు ముడి చమురు ధరల పెరుగుదల. ప్రభుత్వ సంస్థలు సబ్సిడీలు లేదా ఆదేశాల ప్రకారం ధరలను నియంత్రించినప్పటికీ, ప్రైవేట్ కంపెనీలు తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ధరలను నేరుగా పెంచుతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ అవుట్లెట్లలో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ప్రైవేట్ అవుట్లెట్లలో వాహనదారులు భారీ పెంపును ఎదుర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa