ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వదిన ను పెళ్లి చేసుకున్న మరిది'.. ప్రశంసిస్తున్న నెటిజెన్స్

national |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 08:19 PM

జీవితాంతం తోడు ఉంటాడనుకున్న భర్త కొవిడ్ కారణంగా మరణించాడు. అప్పటికే 19 నెలల కుమార్తె ఉన్న ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన భర్త సోదరుడే ఆమెను వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచాడు. అహ్మద్‌నగర్ జిల్లా అకోలే తాలూకాలోని ఢోక్రీకి చెందిన నీలేష్ శేటే 2021 ఆగస్టు 14న కరోనా రెండో వేవ్‌లో మరణించాడు. అతను రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగం చేసేవాడు. కరోనా బారినపడి కోలుకుంటున్న సమయంలోనే.. మెదడులో కణితి ఏర్పడింది. నాసిక్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిరోజులకే ప్రాణాలు కోల్పోయాడు. అతనికి 19 నెలల కుమార్తె, భార్య పూనమ్ ఉన్నారు. ఇప్పుడు నీలేష్​ సోదరుడే పూనమ్​ను పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు. వీరిని పలువురు ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa