అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకే సమతామూర్తి స్థాపన జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ముచ్చింతల్లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్న జగన్ సమతామూర్తి విగ్రహం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన సీఎం రోడ్డు మార్గంలో ముచ్చింతల్ చేరుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో జగన్ తొలుత ప్రవచన మండపానికి చేరుకున్నారు. చినజీయర్ స్వామి సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారన్నారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఇలాంటి గొప్పకార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్ స్వామికి అభినందనలు తెలిపారు. రామానుజ స్వామి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సమతామూర్తి విగ్రహం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అనంతరం చిన్నారులు ప్రజ్ఞా పుస్తకాలను సీఎంకు బహూకరించారు. అక్కడి నుంచి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని సీఎం దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa