కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రభావం ఇప్పట్లో పోదని స్పష్టం చేసింది. ప్రపంచంలో దశాబ్దాల పాటు కోవిడ్ ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు. వైరస్ సుదీర్ఘకాలం ప్రబలితే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందన్నారు. ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న సమూహాల్లో దీన్ని ప్రభావం ఎక్కువ ఉంటుందని టెడ్రోస్ అధనోమ్ అన్నారు. అదే సమయంలో ప్రపంచంలో సాగుతోన్న వ్యాక్సినేషన్పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కామన్వెల్త్లోని జనాభాలో 42 శాతం మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నట్టు, ఆఫ్రికన్ దేశాలు సగటున 23 శాతం వ్యాక్సినేషన్ రేటును సాధించినట్టు తెలిపారు. టీకా ప్రక్రియలో దేశాల మధ్య ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాధాన్యతనిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు కూడా కరోనా వేరియంట్ల ముప్పు పోలేదని చెబుతున్నారు. కోవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాగా రష్యాలో ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. అక్కడ ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత నెలతో పోల్చితే ప్రస్తుతం కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది. జనవరిలో 17,000 నమోదైన కేసులు.. తాజాగా ఆదివారం 1,89,071 కేసులు వెలుగులోకి వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa