ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న పాలవెల్లువ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 05:11 PM

కృష్ణా జిల్లాలో జగన్ అన్న పాలకొల్లు పథకం కింద 700 మంది మహిళా పాడి రైతులకు 30 వేల రూపాయల చొప్పున వర్కింగ్ క్యాపిటల్ గా స్వల్పకాలిక రుణాలు అందించామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. ఏ. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో జగనన్న పాల వెల్లువ పథకంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రైవేటు డైరీల దోపిడీ నుండి పాడి రైతులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో పాలు అందించే పాడి రైతులకు మంచి ధర అందించడంతోపాటు, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నామన్నారు.


జిల్లాలోని జగనన్న పాలవెల్లువ పధకంలో 1800 మంది పాడిరైతులను గుర్తించామని, వీరిలో 700 మందికి 30 వేల రూపాయల చొప్పున వర్కింగ్ కాపిటల్ గా స్వల్పకలోక రుణాలు అందించమన్నారు. దీర్ఘకాలంలో పాలు అందించేవారికి లక్ష రూపాయలు చొప్పున దీర్ఘకాలిక రుణాలు అందిస్తామన్నారు. అంతేకాక పాడి పశువులకు పోషకాలతో కూడిన దాణాను అతి తక్కువ ధరకు అందిస్తున్నామని, దీనితోపాటు సచివాలయ వారీగా పశు వైద్య శిబిరాలు నిర్వహించి ఉచుట వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇన్ని ప్రయోజనాలున్న జగనన్న పాలవెల్లువ పథకాన్ని మహిళా పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.


జిల్లాలో మహిళా పాడి రైతుల ఆర్ధికాభివృద్ది కోసం అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ కార్యక్రమంనకు ప్రారంభం నుండీ మంచి స్పందన వచ్చిందన్నారు. జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా కలిగే ప్రయోజనాలను మహిళా పాడి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా సమావేశాలు ఏర్పాటుచేసి వివరించాలన్నారు. సమావేశానికి ప్రతీ పాడి రైతు హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రైవేట్ డైరీల పాల సేకరణ కేంద్రంలో కన్నా, జగనన్న పాల వెల్లువ పాల సేకరణ కేంద్రంలో వెన్న శాతం ఎక్కువగా నమోదు అవుతున్నదని పాడి రైతులు గుర్తించారన్నారు.


జగనన్న పాల వెల్లువ పధకంలో గ్రామ మహిళా డైరీ అసోసియేషన్ ఏర్పాటు సహకార సంఘాల మాదిరిగా ఏర్పాటు కావాలన్నారు. ఈ సంఘంలో సభ్యులు సంఘం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసే వారై ఉండాలన్నారు. పాల సేకరణ కోసం నియమింపబడే రూట్ ఇంచార్జ్ లు, ప్రమోటర్లు, గ్రామ సంఘ కార్యదర్సులు, సహాయ కార్యదర్సులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. సంఘ కార్యదర్శి పాల సేకరణకు సంబందించిన ప్రతీ అంశాన్ని రిజిస్టర్ లోను, ఆన్లైన్ లో నమోదు చేయవలసి ఉంటుందన్నారు.


జగనన్న పాలవెల్లువ పధకం విజయవంతంలో ప్రమోటర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారని మహిళా డైరీ అసోసియేషన్ కేంద్రం లో ప్రమోటర్లుగా నియమించబడే వాళ్ళ ఎంపికలో ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుందన్నారు. నిరంతరం కేంద్రానికి పాలు సరఫరా చేసేవారు, కేంద్రం అభివృద్ధికి కృషి చేసేవారిని ప్రమోటర్లుగా ఎంపిక చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa