ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తపుడు సమాచారంతో అఫిడవిట్...మంత్రికి రెండు నెలల జైలు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 01:24 AM

తపుచేస్తే వారికి శిక్ష తపుదు. అది ఎవరికైనా సరే అన్నది మరోసారి రుజువైంది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మహారాష్ట్ర మంత్రి బచ్చు కడూకు రెండు నెలల జైలు శిక్ష పడింది. 2014 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఆస్తులకు సంబంధించిన వివరాలను దాచినందుకు ఆయనకు రెండు నెలల జైలు శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ మహారాష్ట్రలోని చందూర్ బజార్‌లోని ఫస్ట్‌క్లాస్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో బచ్చు కడూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు ఆమోదించింది. హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఫిడవిట్‌లో శిశు సంక్షేమ, విద్యా శాఖ సహాయ మంత్రి ఓంప్రకాష్ బాబురావు కడు అలియాస్ బచ్చు కడు ముంబైలోని తన ఫ్లాట్ గురించి పేర్కొన లేదు. దీనికి సంబంధించి 2017లో బచ్చు కడుపై బీజేపీ కౌన్సిలర్ గోపాల్ తిరమరే ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కడూను దోషిగా నిర్ధారించిన కోర్టు.. శిక్షను ఖరారు చేసింది. 2004లో బచ్చు కడూ స్వతంత్ర అభ్యర్థిగా అచల్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. 2009, 2014, 2019లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బచ్చు కడూ శివసేన కోటా నుంచి రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa