శాంతి సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్న ఉత్తర కొరియాపై మరో దేశం నిషేధం విధించింది. ఉత్తర కొరియాకు వెళ్లరాదంటూ తన దేశ ప్రజలపై నిషేధం విధించింది మలేషియా. తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ఈ నిషేధం ఉంటుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. గతంలో ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉండేవి. ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ సోదరుడు దారుణ హత్యకు గురైన తర్వాత ఈ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa