ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఉత్తరాఖండ్ , గోవాలలో పోలింగ్

national |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 10:45 AM

ఉత్తరాఖండ్ , గోవాలలో ఈనెల 14న ఒకే దశలో పూర్తికానున్న శాసనసభ ఎన్నికలకు ప్రచారం నిన్నటితో ముగిసింది. వీటితో పాటు ఉత్తర్ ప్రదేశ్ లో..... రెండోదశ కింద తొమ్మిది జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాల్లో. రేపు జరిగే పోలింగ్ కు కూడా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్తరాఖండ్ లోని 70 స్థానాలకు., గోవాలోని 40 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. UPలోని... సహారన్ పూర్, బిజ్నోర్ , మొరాదాబాద్ , సంభాల్, రాంపుర్, ఆమ్రోహా, బదాయు, బరేలీ, షాజహాన్ పుర్ జిల్లాల్లో 55 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఓటర్లు రేపు తీర్పు ఇవ్వనున్నారు. అటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొవిడ్ కారణంగా అభ్యర్థుల ప్రచారంపై విధించిన నిషేధాజ్ఞలను ఎన్నికల సంఘం మరోసారి సడలించింది. పరిమిత సంఖ్యలో  పాదయాత్రలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ప్రచార సమయాన్ని పొడిగించింది. ఉదయం 6 గంటల నుంచి.... రాత్రి 10 గంటల వరకు అభ్యర్థులు, పార్టీలు  ప్రచారం నిర్వహించుకోవచ్చని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సమావేశాల్లో..... మైదాన సామర్థ్యం లక్ష మంది వరకు ఉంటే 50శాతం మంది ప్రజలు పాల్గొనేందుకు సమ్మతించింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa