ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మార్చి 1వ తేదీ మంగళవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ రోజున ఉదయం ఆయన గుంటూరు నగరంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ వజ్రోత్సవ వేడుకలో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటల నుంచి 10.45 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం బృందావన్గార్డెన్స్లోని అన్నమయ్య లైబ్రరీని సందర్శిస్తారు. అక్కడి నుంచి ఉదయం 11.30 గంటలకు రైల్పేట మెయిన్రోడ్డులోని లక్ష్మీవిహార్కి చేరుకొంటారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడ ఉండి అనంతరం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్కి బయలుదేరి వెళతారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు జరిగే డాక్టర్ రామినేని ఫౌండేషన్ ప్రతిభ పురస్కారాల కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత విజయవాడకు బయలుదేరి వెళతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa