ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2017, 12:18 PM

వాడ్‌నగర్: గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి తన సొంతూరు వాడ్‌నగర్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ టూర్‌లో భాగంగా తాను చదువుకున్న స్కూలు, ఒకప్పుడు చాయ్ అమ్మిన స్టాల్‌ను మోదీ సందర్శించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాను చాయ్ అమ్మిన వాడ్‌నగర్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన ఊళ్లో అడుగుపెట్టగానే కాన్వాయ్ వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. మోదీ కూడా వాహనం బయటకు వచ్చి చేతులు ఊపుతూ వారికి అభివాదం చేశారు. త్వరలో గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన అక్కడి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.హట్‌కేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మోదీ తన పర్యటనను మొదలుపెట్టారు. ముందు తాను చదివిన స్కూలుకు వెళ్లగానే అక్కడి మట్టిని తీసి నుదుటన బొట్టుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత రూ.500 కోట్లతో నిర్మించిన సివిల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్‌ను ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మోదీ వెంట ఉన్నారు. జీఎంఈఆర్‌ఎస్ మెడికల్ కాలేజీలోని విద్యార్థులతో కాసేపు ఆయన ముచ్చటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa