విజయనగరం: జిల్లాలో వైసీపీకి మరో దెబ్బ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నియోజకవర్గ సమన్వయ కర్త పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.నేను విజయనగరం వైసీపీ శాసనసభ నియోజకవర్గ సమన్వయ కర్తగా 2014 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను. అంతే కాదు కొంతమంది నాయకులతో కలిసి పనిచేయలేని పరిస్థితి ఉంది. అందువల్ల విజయనగరం నియోజకవర్గ సమన్వయ కర్త బాధ్యతల నుంచి తప్పకుంటున్నాను’’ అని వీరభద్రస్వామి వైసీపీ అధిష్టానానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa