ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ మారిన...ఆన్ లైన్లో ఇంకా మారలేదు...అందుకే ఇలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 01:49 PM

సినీ నటుడు మోహన్ బాబు పేరిట పేదలకు ఇచ్చే భూములు అన్న కథనం మీడియాలో పెద్ద చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎ లోని 2.79 ఎకరాలు సినీనటుడు మోహన్‌బాబు, 412-1బిలో 1.40 ఎకరాలను ఆయన తనయుడు మంచు విష్ణు పేరిట దరఖాస్తు పట్టా జారీ చేయడం వివాదాస్పదమైంది. వీరిద్దరూ నిరుపేదలా? అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడంపై చంద్రగిరి తహసీల్దార్ స్పందించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 412-1లో 5.29 ఎకరాల భూమికి 1928లో దరఖాస్తు పట్టాలు మంజూరు చేసినట్టు చెప్పారు. 1942 నుంచి 2001 వరకు ఈ భూమిపై 11సార్లు క్రయవిక్రయాలు జరిగినట్టు చెప్పారు. 18 జూన్ 1954 కంటే ముందు మంజూరైన దరఖాస్తు పట్టా భూములను తొలుత నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2016లో అప్పటి ప్రభుత్వం జీవో 215ను జారీ చేసినట్టు చెప్పారు. దీంతో మోహన్‌బాబు, విష్ణు పేరిట ఉన్న భూములు డీకేటీ నుంచి పట్టా భూములుగా మారాయని, అయితే ఆన్‌లైన్‌లో మాత్రం డీకేటీగానే కొనసాగుతుండడంతో సమస్య తలెత్తిందని శిరీష వివరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa