అనంతపురం: ధర్మవరం, బత్తలపల్లి ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతున్న విద్యార్థిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి, కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడిపత్రి పట్టణం జివిపి కాలనీకి చెందిన చెన్నూరు లక్ష్మీదేవి, పెద్దయ్య కుటుంబ సభ్యులు గత ఆరు సంవత్సరాలుగా బత్తలపల్లిలో గుడారాలు వేసుకొని ఊరూరా తిరుగుతూ ప్లాస్టిక్, స్టీలు వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మీ దేవి కుమారుడు పవన్ కుమార్ (8) ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం రోడ్డు దాటుతుండగా వేల్పుమడు గుకు చెందిన ద్విచక్రవాహదారుడు ఢీకొట్టడం తో కాళ్ళు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడటం తో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. ఉన్న ఒక్కగానొక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, గతంలోనే భర్త చనిపోవడంతో మృతుని తల్లి లక్ష్మీదేవి బోరున విలపించారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పోలీసు లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa