ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళ్ల గ్రౌండింగ్ నిర్మాణంలో అదనపు దృష్టి పెట్టండి: జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 03:31 PM

నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణంలో అదనపు దృష్టి పెట్టాలని, ఇళ్ల నిర్మాణంలో పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో అనంతపురం డివిజన్ స్థాయి సమీక్షలో భాగంగా హౌసింగ్, రెవెన్యూ, వ్యవసాయం, జగనన్న సంకల్పం, గ్రామ, వార్డు సచివాలయాలు, పంచాయతీ రాజ్, మెడికల్ అండ్ హెల్త్, తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఓలు, ఈఓఆర్డీలు, హౌసింగ్ డిఈలు, ఏఈలు, ఏఓలు ఇతర క్షేత్ర స్థాయి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ. సిరి, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డివిజనల్ స్థాయి లో నెలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, అందులో భాగంగా అనంతపురం డివిజన్ రివ్యూ సమావేశం నిర్వహించామన్నారు. హౌసింగ్ పై సమీక్ష నిర్వహిస్తూ నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల గ్రౌండింగ్ పూర్తిగా 100 శాతం ఈ వారంలోనే పూర్తి కావాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ కి సమయం లేదని, అదనపు దృష్టి సారించి లబ్ధిదారులకు అవసరమైన రుణాలు ఇప్పించి గ్రౌండింగ్ పూర్తిచేయాలన్నారు. జగనన్న లేఔట్ లలో బోర్లు వేయడం, పైప్లైన్ ఏర్పాటు, నీటిసరఫరా చేయడం లాంటి వెంటనే పనులు పూర్తిగా చేపట్టాలన్నారు.


ఇళ్ల నిర్మాణం పనులు ఈ నెలాఖరులోపు బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని, ఇందుకోసం రోజువారీగా మానిటర్ చేసి కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేపించాలన్నారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రోజువారీగా లక్ష్యాలను నిర్ణయించి, నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఇందు కోసం తహసీల్దార్ లు, ఎం పి డి ఓలు, హౌసింగ్ అధికారులు ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. అలాగే అర్హులైన వారు ఎవరు మిస్ కాకుండా అర్హులకు పట్టాలు అందించాలన్నారు. ఓటిఎస్ (వన్ టైం సెటిల్మెంట్) కు సంబంధించి లబ్ధిదారుల డేటా ఎంట్రీ బుధవారం సాయంత్రం లోగా 100 శాతం పూర్తి చేయాలని, పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో అప్రూవల్ జాగ్రత్తగా ఇవ్వాలన్నారు. ఈనెల 9వ తేదీన నిర్వహించే మెగా మేళ కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. డబ్బులు కట్టిన వారికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెలాఖరు లోపు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర అవసరమైన వివరాలు అన్నీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa