ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్య కేసును చేదించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 03:38 PM

అనంతపురం: గుమ్మగట్ట మండలంలోని జె. వెంకటాంపల్లికి చెందిన బోయ నింగప్ప (35) హత్య కేసులో మిస్టరీని కర్ణాటక పోలీసులు ఛేదించారు. వివరాలను కర్ణాటకలోని రాంపురం ఎస్ఐ గాదిలింగప్ప బుధవారం వెల్లడించారు. నింగప్ప భార్య పార్వతమ్మ అదే గ్రామానికి చెందిన బోయవన్నూరు స్వామితో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసి భార్యను నింగప్ప మందలించాడు. దీంతో నింగప్పను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. గత నెల 21న రాంపురం మార్కెట్లో గొర్రెలను విక్రయించేందుకు నింగప్ప వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న వన్నూరు స్వామి. నింగప్పకు తెలియకుండా అనుసరించాడు.


రాత్రికి తిరుగు ప్రయాణమైన నింగప్పను బైరాపురం వద్ద కలిసి తాను కూడా పనిపై వచ్చానని, మద్యం తాగి బయలుదేరుదామంటూ ఒత్తిడి చేశాడు. తాను మద్యం తాగుతున్నట్లు నటిస్తూ నింగప్పను పూర్తిగా మత్తులోకి జారుకునేటట్లు చేసి బండ రాయితో తలపై మోది హత మార్చాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖాన్ని చక్కరాయితో చెక్కి వెళ్లిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ గాదిలింగప్ప. హతుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా వన్నూరుస్వామిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. హత్యకు పార్వతమ్మతో కలిసి ప్రణాళిక రచించినట్లుగా విచారణలో నిందితుడు అంగీకరించాడు. దీంతో బుధవారం వీరిద్దరినీ కర్నాటక పోలీసులు అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa