అనంతపురం జిల్లా పెనుకొండ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఆకతాయిలు నిప్పు వేయడం వల్ల మంటలు చెలరేగుతున్నాయి. వివరాల్లోకి వెళితే పెనుకొండ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పెనుకొండ మండలం పులేకమ్మ గుడి వద్ద జాతీయ రహదారి 44 రోడ్డు ప్రక్కన ఉన్న అడవి పరిసర ప్రాంతాల్లో ఎవరో ఆకతాయిలో, దారి వెంబడి పోయే వారో నిప్పు వేయడం వల్ల మంటలతో అడవి ప్రాంతమంతా మంటలు వ్యాపిస్తున్నాయి.
ఈ సందర్భంగా జిల్లా ఫారెస్టు అధికారులకు సమాచారం అందడంతో, పెనుకొండ ఇంచార్జ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఏబివో దివాకర్, సోమందేపల్లి గ్రామస్తులు నరేష్, గంగాధర , ప్రసాద్ మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. సాధ్యమైనంత ప్రయత్నం చేస్తూ మంటలు ఆర్పుతూ వస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఎండాకాలం కాబట్టి అడవి ప్రాంతాల్లో మంటలు రగులుతూనే ఉన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే రాత్రింబవళ్ళు సాయశక్తులా మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నామని బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa