ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టాలపై అవగాహన అవసరం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 03:55 PM

చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం. విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గువారం నార్పల మండలం గొల్లపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయాన్ని దళిత ప్రజలతో కలిసి సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. నగరంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎస్సీ కమిషన్ పనిచేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ కుల, మత, వర్గ వివక్షత లేకుండా అందరికీ సామాజిక న్యాయం అందజేసినట్లు తెలిపారు.


రాజ్యాంగ హక్కులను అమలు చేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ శాంతి సభ ముఖ్య ఉద్దేశమన్నారు. చట్టాలను ప్రభుత్వ ఉత్తర్వులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మనుషులంతా ఒకటేనని, గుడిలు బడులు అందరి కోసమే అని విద్య, విజ్ఞానం వలన జీవన విధానంలో అనేక మార్పులు వస్తాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆచార సంప్రదాయాలను కూడా గౌరవించుకుంటూ శాంతి సామరస్యాలతో ఐక్యంగా జీవించాలని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను , చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, అనేక విధాలుగా నష్టపోతారని హెచ్చరించా. రు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa