ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అందించిన సమాచారం ప్రకారం 2016-2018 మధ్య రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 466 ప్రమాదకరమైన స్థలాలు (బ్లాక్ స్పాట్స్) ఏర్పడినట్లు రాజ్యసభలో రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను నిర్ధారించేందుకు తమ మంత్రిత్వ శాఖ ఒక ప్రోటోకాల్ను రూపొందించిందని మంత్రి తెలిపారు.
జాతీయ రహదారిపై 500 మీటర్ల భాగంలో మూడేళ్ళలో అయిదు రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా ఈ ప్రమాదాలలో 10 మంది మరణించినా ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తిస్తారు. ఆ విధంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లను సరిదిద్దేందుకు తాత్కాలిక చర్యలతోపాటు శాశ్వత చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. జాతీయ రహదారులపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించడానికి ముందుగానే వాటిని ముందుగానే నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధింత ఉన్నతాధికారులందరికీ తమ మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్లో లేఖ రాసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో దాదాపు 80 శాతం వరకు శాశ్వత ప్రాతిపదికన సరిదిద్దినట్లు మంత్రి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa