ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ చార్జీలు మరో సరి పెరగటం గమనార్హం. ఇప్పటికే కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్న సమయంలో చార్జీలు పెంచడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం మీద టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందిస్తూ....పేదవాడి రక్తాన్ని పీల్చడమే పనిగా పెట్టుకున్న జగన్ రెడ్డి, ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాట తుంగలో తొక్కాడు. కరెంటు రేట్లు పూర్తిగా తగ్గించేస్తా అని అధికారంలోకి వచ్చి ఇంకా మూడేళ్లు గడవక ముందే వరుసగా విద్యుత్ చార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరిచాడు. ఇతగాడు చెప్పేదొకటి చేసెదొకటి. నెలకొకసారి చూసే సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తారు అట.. 24 గంటలూ వాడే కరెంట్ కు మాత్రం చార్జీలు విపరీతంగా పెంచేసి జనం నడ్డి విరుస్తారంట. తన విష పుత్రికలో తనకు నచ్చినట్లు నాలుక మడతెట్టడం. కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి మాదిరి ప్రజలు ఇవన్నీ గమనించరు అనుకోవడం మీ మూర్ఖత్వం అని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa