ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆ వ్యాఖ్యాలపై...నేటిజన్ల భిన్నాభిప్రాయం

international |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 02:05 AM

సోషల్ మీడియా వచ్చాక ఏది చెప్పినా అది నిమిషాల్లో కోట్లాదిమందికి చేరిపోతోంది. తాజాగా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం వైరల్ అయింది. దేశంలోని రాజకీయ సంక్షోభంపై జాతీనుద్దేశించి ఆయన మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై పోరాటాన్ని క్రికెట్ మ్యాచ్‌తో పోల్చుతూ చివరి బంతి వరకు ఆడతానని అన్నారు. అయితే తన ప్రసంగంలో ఆయన మూడు పదాలను పదే పదే ఉచ్ఛరించారు. ఇమ్రాన్ ఖాన్ మొత్తం 45 నిమిషాలు మాట్లాడారు. అయితే ఆయన ప్రసంగం విన్న నెటిజన్లు మై, ముఝే, మేరా అనే పదాలను ఆయన 213 సార్లు ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ వివరాలను హమీద్ మిర్ అనే పాత్రికేయుడు షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే నెటిజన్ల నుంచి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు ఖాన్‌ను నార్సిసిస్ట్‌‌గా అభివర్ణిస్తూ కామెంట్లు పెట్టగా, మరికొంతమంది ఆయన స్పీచ్‌పై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి అవిశ్వాస తీర్మానికి ముందు పీఎం ఇమ్రాన్ ఖాన్ ఇలా నెటిజన్లకు దొరికిపోయారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వంపై విపక్ష నేతలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఆదివారం జరుగుతుంది. అయితే సంఖ్యా బలం చూసుకుంటే ఇమ్రాన్ గెలిచే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఇన్నాళ్లు ఇమ్రాన్‌ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన పార్టీలు కూడా ఇప్పుడు ప్రతిపక్షాల వైపు వెళ్లిపోయాయి. దీంతో ఈ గండం నుంచి ఇమ్రాన్ ఖాన్ గట్టెక్కే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ తాను వెనక్కి తగ్గనని, రాజీనామా చేయనని కచ్చితంగా చెప్పారు. అదే సమయంలో అమెరికాపై విమర్శలు గుప్పించారు. తనను పదవి నుంచి దించడానికి అమెరికా పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తాను అధికారంలో ఉంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తింటాయనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నారని ఆయన అన్నారు. అయితే అమెరికా నేతలు ఇమ్రాన్ ఆరోపణలను ఖండించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa