ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ టూరిజంఉన్నతాధికారులు మరియు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వటూరిజం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ నూతనంగా మచిలీపట్టణం పార్లమెంట్ పరిధితో ఏర్పడిన కృష్ణాజిల్లలో కేంద్ర ప్రభుత్వ పధకం అయిన స్వదేశ్ దర్శన్ కింద మచిలీపట్టణంలోని మంగినపూడి బీచ్ ని అభివృద్ధి చేయాలనీ ఉన్నతాధికారులకు సూచించారు.
ఎంతో చరిత్ర కలిగిన బందర్ పట్టణంలోని మంగినపూడి బీచ్ ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వ పధకం అయిన స్వదేశ్ దర్శన్ కింద ఫేజ్ -1 లో మంగినపూడి బీచ్ ఫ్రంట్ పార్క్, చక్కటి వసతి కోసం రిసార్టు లు, మ్యూజికల్ ఫౌంటెన్ లు, లేజర్ షో లు, డేస్టినేషన్ వెడ్డింగ్ ల కొరకు ఒక మంచి కన్వెన్షన్ హాల్ కూడా ఈ పధకం కింద నిర్మించ వలసినదిగా కోరియున్నారు. అలాగే బందర్ పట్టణంలోని కోనేరుసెంటర్ని కూడా హెరిటేజ్ డెవలప్మెంట్ కింద అభివృద్ధి చేయాలని, ఈ మొత్తం అభివృద్ధి పనుల కోసం 50 నుండి 75 కోట్ల రూపాయలను మంజూరు చేయాలనీ కోరారు.
ఫేజ్-2 కింద కోడూరు మండలం లోని హంసలదీవి ప్రాంతాన్ని పర్యాటక రంగం ఆకర్షించే విధంగా అభివృద్ధి పరచాలని, అలాగే నాగాయలంక మరియు సముద్ర తీరంలోనున్న కృతివెన్ను మండలంలోని చినగొల్లపాలెంలో సముద్రపు బ్యాక్ వాటర్ నందు బోటు షికారు కొరకు తగిన ప్రతిపాదనలు తయారుచేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తో పాటు కేంద్ర ప్రభుత్వ టూరిజం డైరెక్టర్ జనరల్ సీనియర్ ఐ. ఏ. ఎస్. అధికారి అయిన శ్రీ కమల వర్ధన్ గారు, ఐ. టి. డి. సి. చీఫ్ ఇంజనీర్, టూరిజం కన్సల్టెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఉన్నతాధికారులు అయిన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ, ఎక్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీ మల్రెడ్డి , చీఫ్ ఇంజనీర్ మూర్తి మొదలగు వారు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa