ఐపీఎల్ 2022 సీజన్లో శనివారం రెండు మ్యాచ్ లో జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరగనుండగా, ఇంకో మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య రాత్రి ఏడున్నర గంటలకు జరగనుంది.
ఈ సీజన్లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ లలోను ఓటమి చవిచూసిన రోహిత్ సేన నేడు జరగబోయే మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటమితో అప్రతిష్టను మూట కట్టుకున్న ముంబై జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తేనే బెంగుళూరుపై గెలిచి, విజయాల ఖాతాను తెరవగలదు.
మరోవైపు బెంగుళూరు జట్టును పరిశీలిస్తే, ఆ జట్టు బౌలింగ్ వనిందు హసరంగా,మహ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లీ, ఆకాష్ దీప్ వంటి ఆటగాళ్లతో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్ అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు ఈ మ్యాచ్ లోనైనా మెరుగ్గా రాణిస్తే బెంగుళూరు జట్టు ముచ్చటగా మూడో విజయాన్ని అందుకోగలుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa