ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022: నేటి మ్యాచ్

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 12:02 PM

ఐపీఎల్ 2022 సీజన్లో శనివారం రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరగనుండగా, ఇంకో మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య రాత్రి ఏడున్నర గంటలకు జరగనుంది.ఈ సీజన్లో ఇప్పటి వరకు తమ విజయ ఖాతా తెరవని చెన్నై, హైదరాబాద్ జట్లు తలపడనుండటంతో శనివారం మధ్యాహ్నం జరగున్న మ్యాచ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ చెన్నై పరాజయం చవిచూడగా, కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడింది. చెన్నై బ్యాటర్లు ఋతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, కెప్టెన్ రవీంద్ర జడేజా,ధోనీ మెరుగైన ఆటతీరుతో, రాణిస్తేనే ఈ మ్యాచ్ లో విజయం సాధించగలుగుతుంది. పవర్ ప్లే స్పెషలిస్ట్ దీపక్ చాహర్ లేని లోటు చెన్నై జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది. 


హైదరాబాద్ జట్టు విషయానికొస్తే, రాజస్థాన్ తో ఆడిన మొదటి మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శనతో ఓడిన హైదరాబాద్, ఆ తర్వాత లక్నో తో ఆడిన రెండో మ్యాచ్లో విజయానికి దగ్గర వచ్చి వెనుదిరిగింది. ఇటు బ్యాటింగ్,అటు బౌలింగ్ రెండిట్లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తేనే హైదరాబాద్ గెలవగలుగుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 16 ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు జరగగా, చెన్నై 12 మ్యాచ్లలో, హైదరాబాద్ 4 మ్యాచ్లలో విజయం సాధించాయి. ఐపీఎల్ 2018లో ఫైనల్ పోరులో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే అందులో చెన్నై గెలిచి ఛాంపియన్ గా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa