ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 12:45 PM

కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి దర్శన టికెట్లను క్రమంగా పెంచుతోంది. ఈ క్రమంలోనే భక్తులు భారీ సంఖ్యలో కలియుగ దైవం దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు. ఇవాళ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయడంతో పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం పోటెత్తారు. తిరుపతిలోని శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్ కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఇవాళ సర్వదర్శనం టోకెన్లు పొందిన వారికి ఈ నెల 12లోపు దర్శన స్లాట్ లభిస్తుందని టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం విడుదల చేయాలనుకున్న సర్వదర్శన టోకెన్లను ఒకరోజు ముందే.. అంటే మంగళవారమే విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లను విడుదల చేయడం లేదని, భక్తులు సహకరించాలని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa