ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ హామీలను కట్టడి చేయలేం...చట్టంలో నిబంధనల్లేవ్

national |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 02:58 PM

మన చట్టంలోని లోపాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. రాజకీయ పార్టీలు ప్రకటించే హామీలను, ఉచిత పథకాలను కట్టడి చేయలేమని, ఇందుకు చట్టంలో నిబంధనలు లేవని భారత ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీం కోర్టుకు తెలియజేసింది. చట్టంలో నిబంధనలు లేకుండా చర్యలు తీసుకుంటే అది అతిక్రమణ అవుతుందని పేర్కొంది. కావాలంటే కోర్టు మార్గదర్శకాలు జారీ చేయవచ్చని సూచించింది. ఉచిత తాయిలాలు ప్రకటించే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎన్నికల సంఘం అఫిడవిట్ ను దాఖలు చేసింది.


‘‘విజయం సాధించిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు.. రాష్ట్రాల విధానాలను, నిర్ణయాలను ఈసీ శాసించలేదు. చట్టంలో ఇందుకు నిబంధనలు లేకుండా చర్యలు తీసుకుంటే పరిధి దాటినట్టు అవుతుంది. రాజకీయ పార్టీలు ప్రకటించే పథకాలు, నిర్ణయాలు ఆర్థికంగా ఆచరణ సాధ్యమేనా లేదా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయా? అన్నది ఓటర్లే నిర్ణయించుకోవాలి’’అంటూ ఈసీ తన అఫిడవిట్ లో సుప్రీం కోర్టుకు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa