ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 12న కొత్త చెరువుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 10, 2022, 12:00 PM

ఈ నెల 12వ తేదీన జనసేన పార్టీ వ్యవస్థాప కులు ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొత్తచెరువులో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకుడు పూల శివ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ఈనెల 12వ తేదీన మండల కేంద్రంలోని ధర్మవరం రహదారి ప్రక్కన డిపో రమేష్ గృహములో ఏర్పాటుచేసిన రైతుల పరామర్శలో భాగంగా సమిటి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ పర్యటన ను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయవంతం చేయాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa