ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 1054 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 10, 2022, 12:03 PM

కరోనా మొదటి, రెండు దశల్లో విజృంభించింది. దేశంలో ఎంతో మంది తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులను కోల్పోయారు. కోవిడ్ థర్డ్ వేవ్‌లో మరణాల సంఖ్య తక్కువగా నమోదవడం ఊరటనిచ్చింది. కేసుల నమోదు తగ్గుదలతో దేశవ్యాప్తంగా నిబంధనలు ఎత్తి వేశారు. అయితే కరోనా ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్ బీఏ1, బీఏ2, ఎక్స్‌ఈ సబ్ వేరియంట్లు హడలెత్తిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు రెండు ఎక్స్‌ఈ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉండగా దేశంలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 1054 కరోనా కేసులు వెలుగు చూశాయి. 29 మంది కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,21,685కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 11,132 ఉన్నాయి. ఇదిలా ఉండగా నేటి నుంచి 18 ఏళ్లు దాటిన వారు కరోనా బూస్టర్ డోస్ పొందేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కోవిన్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుని ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి, బూస్టర్ డోస్ పొందొచ్చు. కరోనా బూస్టర్ డోస్‌ నిమితం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా ధర రూ.225గా ఉత్పత్తిదారులు నిర్ణయించారు. ఆ రుసుమును చెల్లించి కరోనా రెండో టీకా తీసుకున్న వారు బూస్టర్ డోస్ పొందొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa